ప్రభుత్వ వైఫల్యాలపై దిల్లీలో రాహుల్ ప్రెస్ మీట్

దేశంలో యువత భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ దేశంలో సరైన విద్యా వ్యవస్థ లేదని, భారత విద్యావిధానాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 152 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. విద్యార్థుల మూడు డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీక్లపై ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


