పోస్టుమాస్టర్ నిర్లక్ష్యం.. బాధితుడికి ఆర్థిక నష్టం

AP: రికరింగ్ డిపాజిట్ (RD) వ్యవహారంలో పోస్టుమాస్టర్ నిర్లక్ష్యంతో ఆర్థికంగా, మానసికంగా నష్టపోయానని అంబేడ్కర్ కోనసీమ జిల్లా లక్కవరం గ్రామానికి చెందిన జిల్లెల్ల శ్రీనివాస్ ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం గతంలో పోస్టుమాస్టర్ సుబ్రహ్మణ్యాన్ని సంప్రదించినా ఫలితం లేకపోవడంతో వినియోగదారుల సంక్షేమ సంఘాన్ని ఆశ్రయించారు. తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ పోస్టుమాస్టర్కు సంఘం ఆధ్వర్యంలో రిజిస్టర్డ్ లేఖ పంపించారు. లేఖ అందిన 15 రోజుల్లోగా బాధితుడికి నష్టపరిహారం అందించాలని వారు సూచించారు.



