← Back to news

మూసారాంబాగ్‌ హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం

By Vishi· 4d ago
మూసారాంబాగ్‌ హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం

TG: మూసీ నదిపై నిర్మించిన మూసారాంబాగ్‌ హైలెవల్ బ్రిడ్జిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో అంబర్‌పేట్, మూసారాంబాగ్‌ ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత ఈజీగా సాగనున్నాయి. ట్రావెలింగ్ టైం చాలా తగ్గుతుంది. సుమారు రూ.52 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ దీన్ని పూర్తి చేసింది. ట్రాఫిక్ జాం సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని వాహనదారులు ఆశిస్తున్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 59m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.