చేపల వేట విషాదం.. మత్స్యకారుడు మృతి

AP: శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు పంచాయతీ గడ్డ ఊరు సముద్ర తీరంలో చేపల వేట విషాదంగా మారింది. మంగళవారం చేపల వేటకు వెళ్లిన వంక యాదవరావు (55) ప్రయాణిస్తున్న తెప్ప ఒక్కసారిగా బోల్తా పడటంతో సముద్రంలో మునిగి మృతి చెందారు. ఆయనతో పాటు మరో ముగ్గురు మత్స్యకారులు కూడా సముద్రంలో పడిపోగా సురక్షితంగా బయటపడ్డారు. అయితే యాదవరావు తెప్ప కింద చిక్కుకోవడంతో స్థానికులు తీవ్రంగా శ్రమించి ఆయనను ఒడ్డుకు తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.



