← Back to news

ఓటర్ల జాబితాలో తప్పులుంటే వెంటనే చెప్పండి

By SHAIK SUBHANI· 3d ago
ఓటర్ల జాబితాలో తప్పులుంటే వెంటనే చెప్పండి

AP: పల్నాడు జిల్లా గురజాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై తహసీల్దార్ కుటుంబరావు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఓటరు బాధ్యతగా వ్యవహరించి బూత్‌ లెవెల్‌ అధికారులకు సహకరించాలని కోరారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు, అవసరమైన పత్రాలను పరిశీలిస్తున్నందున ప్రజలు పూర్తి సహకారం అందించాలని సూచించారు. జాబితాలో పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలించుకుని తప్పులు ఉంటే వెంటనే బీఎల్‌వోలకు తెలియజేయాలని తెలిపారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 59m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.