ఓటర్ల జాబితాలో తప్పులుంటే వెంటనే చెప్పండి

AP: పల్నాడు జిల్లా గురజాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై తహసీల్దార్ కుటుంబరావు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఓటరు బాధ్యతగా వ్యవహరించి బూత్ లెవెల్ అధికారులకు సహకరించాలని కోరారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు, అవసరమైన పత్రాలను పరిశీలిస్తున్నందున ప్రజలు పూర్తి సహకారం అందించాలని సూచించారు. జాబితాలో పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలించుకుని తప్పులు ఉంటే వెంటనే బీఎల్వోలకు తెలియజేయాలని తెలిపారు.



