ఒంటి కాలితోనే.. కుంటుతూ బడికెళ్తోంది
UPలోని బల్లియా జిల్లా మానియర్ బ్లాక్లోని రానీపూర్ గ్రామానికి చెందిన రాగిణికి ఏడేళ్లు. ఆరు నెలల వయసులోనే రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోయింది. తను 1వ తరగతి చదువుతోంది. ఇంటి నుంచి 400 మీటర్ల దూరంలోని బడికి ఒంటికాలితో గెంతుతూ వెళ్తోంది. అయినా చదువు మాత్రం విడిచిపెట్టలేదు. SMలో వైరల్ అయిన తన ఉదంతం జిల్లా కలెక్టర్ మంగళా ప్రసాద్ సింగ్ను కదిలించింది. ఆయన రాగిణి ఇంటికి వచ్చి ట్రైసైకిల్, పుస్తకాలు, బొమ్మలు ఇచ్చారు. AAP నాయకులు ఆర్థికసాయం అందించారు. కృత్రిమ కాలు పెట్టిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.


