కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై BRS నిరసన

TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యిరోజుల పాలనపై BRS నిరసన చేపట్టింది. కడెం పట్టణంలో నియోజకవర్గ ఇంచార్జ్ జాన్షన్ నాయక్ ఆధ్వర్యంలో ప్రధాన వీధులు, మార్కెట్ ఏరియాలో భారీ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. జాన్షన్ నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీల హామీలు ఎక్కడ అమలయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.




