← Back to news

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై BRS నిరసన

By GANDHAM PRAVEEN KUMAR· 2h ago
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై BRS నిరసన

TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యిరోజుల పాలనపై BRS నిరసన చేపట్టింది. కడెం పట్టణంలో నియోజకవర్గ ఇంచార్జ్ జాన్షన్ నాయక్ ఆధ్వర్యంలో ప్రధాన వీధులు, మార్కెట్ ఏరియాలో భారీ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. జాన్షన్ నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీల హామీలు ఎక్కడ అమలయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై BRS నిరసన

More in Local

ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నాయకులు
Local· just now

ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

TG: వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నల్లబెల్లి గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో చర్చించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.