← Back to news

రాజోలిలో ప్రీ ప్రైమరీ బడిలో కృష్ణాష్టమి వేడుకలు

By Rajesh· 1d ago

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి పునరావాస గృహాల MPPS న్యూ ప్లాట్స్ పాఠశాలలో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. హెచ్ఎం రామాంజనేయులు ఆధ్వర్యంలో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషాల్లో అలరించారు. నవ్యశ్రీ కృష్ణుడిగా, సంయుక్త గోపికగా ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టి సంబరాలు చేసుకున్నారు. రేణుక, ఇంద్రవర్ధన, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.