టైర్ పేలి డివైడర్ను ఢీకొట్టిన టెంపో

AP: ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై పెళ్లి బృందం ప్రయాణిస్తున్న టెంపో టైరు ఒక్కసారిగా పేలడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మచిలీపట్నం నుంచి తిరుమలకు పెళ్లి కోసం వెళ్తుండగా టైరు పేలడంతో అదుపుతప్పిన టెంపో డివైడర్ను ఢీకొట్టింది. వాహనంలో 11 మంది ప్రయాణిస్తుండగా పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారంతా కృష్ణా జిల్లా గూడూరుకు చెందినవారిగా గుర్తించారు.



