← Back to news

పలాస విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగి ఆత్మహత్య

By bhaskararao· 4d ago
పలాస విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగి ఆత్మహత్య

పలాస విద్యుత్ శాఖ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సంతోష్ కుమార్(28) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కార్యాలయ టెర్రస్‌పై ఉన్న సోలార్ ప్యానెల్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంతోష్ ఆత్మహత్యకు కారణమేంటని కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 59m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.