పలాస విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగి ఆత్మహత్య

పలాస విద్యుత్ శాఖ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సంతోష్ కుమార్(28) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కార్యాలయ టెర్రస్పై ఉన్న సోలార్ ప్యానెల్కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంతోష్ ఆత్మహత్యకు కారణమేంటని కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



