← Back to news

అమరావతిపై డ్రోన్ కన్ను..!

By rajaratnam· 3d ago
అమరావతిపై డ్రోన్ కన్ను..!

గుంటూరు జిల్లా అమరావతిలో పోలీసులు డ్రోన్ టెక్నాలజీతో నిఘా పెంచారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో తాడేపల్లి, తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, వెలగపూడి, సీతానగరం, కృష్ణానది కరకట్ట ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. ప్రత్యేకంగా పేకాట, కోళ్ల పందేలు, గంజాయి, బహిరంగ మద్యం సేవనంపై దృష్టి పెట్టారు. రాత్రి వేళల్లో నైట్ విజన్ డ్రోన్లతో అనుమానాస్పద కదలికలను గుర్తిస్తున్నారు. అవసరమైతే ఇతర ప్రాంతాలకు నిఘా విస్తరించనున్నారు. అయితే ఇలాంటి నిఘాను ప్రజాందోళనల మీద ప్రయోగించకూడదని ప్రజలు కోరుతున్నారు.

అమరావతిపై డ్రోన్ కన్ను..!

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.