అమరావతిపై డ్రోన్ కన్ను..!

గుంటూరు జిల్లా అమరావతిలో పోలీసులు డ్రోన్ టెక్నాలజీతో నిఘా పెంచారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో తాడేపల్లి, తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, వెలగపూడి, సీతానగరం, కృష్ణానది కరకట్ట ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. ప్రత్యేకంగా పేకాట, కోళ్ల పందేలు, గంజాయి, బహిరంగ మద్యం సేవనంపై దృష్టి పెట్టారు. రాత్రి వేళల్లో నైట్ విజన్ డ్రోన్లతో అనుమానాస్పద కదలికలను గుర్తిస్తున్నారు. అవసరమైతే ఇతర ప్రాంతాలకు నిఘా విస్తరించనున్నారు. అయితే ఇలాంటి నిఘాను ప్రజాందోళనల మీద ప్రయోగించకూడదని ప్రజలు కోరుతున్నారు.




