← Back to news

NQAS గుర్తింపునకు వైద్య సిబ్బంది శ్రమించాలి: DPO

By K.RAJASHEKAR· 22 Aug 2026· Kamareddy
NQAS గుర్తింపునకు వైద్య సిబ్బంది శ్రమించాలి: DPO

TG: గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌కు జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు (NQAS) సాధించేలా వైద్య సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి పద్మజ సూచించారు. శనివారం కామారెడ్డి మండలం గర్గుల్‌లోని పల్లె దవాఖానను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు అందిస్తున్న చికిత్స ప్రమాణాలు, నిరంతర పర్యవేక్షణ, వైద్య సహాయక సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న అన్ని రకాల వైద్య సేవలను నిరంతరం అందించాలని సూచించారు.

More in Local