జీఓ 97 రద్దుకి.. విద్యార్థుల రాస్తారోకో!

మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సీసీసీ కార్నర్ దగ్గర సింగరేణి పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.<br>జీఓ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డు మధ్యలో కూర్చుని, పెద్దపెట్టున నినాదాలు చేశారు.<br>దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మంచిర్యాల ఎసీపీ ప్రకాష్ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వారి డిమాండ్ ను ప్రభుత్వానికి చేరవేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. జీఓ 97 నిజంగా రద్దు కాకపోతే, మళ్లీ పెద్ద ఉద్యమమే వస్తుందని విద్యార్థులు హెచ్చరించారు.



