← Back to news

జీఓ 97 రద్దుకి.. విద్యార్థుల రాస్తారోకో!

By Jelandharkoti· 3d ago
జీఓ 97 రద్దుకి.. విద్యార్థుల రాస్తారోకో!

మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సీసీసీ కార్నర్ దగ్గర సింగరేణి పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.<br>జీఓ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డు మధ్యలో కూర్చుని, పెద్దపెట్టున నినాదాలు చేశారు.<br>దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మంచిర్యాల ఎసీపీ ప్రకాష్ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వారి డిమాండ్ ను ప్రభుత్వానికి చేరవేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. జీఓ 97 నిజంగా రద్దు కాకపోతే, మళ్లీ పెద్ద ఉద్యమమే వస్తుందని విద్యార్థులు హెచ్చరించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.