← Back to news

పోలీస్‌, విద్యుత్‌, పెన్షన్‌ సమస్యలపై ఫిర్యాదులు

By Jelandharkoti Koti· 3d ago
పోలీస్‌, విద్యుత్‌, పెన్షన్‌ సమస్యలపై ఫిర్యాదులు

TG: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు అందాయి. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎంపీడీవో ఉమర్‌ షరీఫ్‌ మాట్లాడుతూ.. ప్రజల నుంచి మొత్తం నాలుగు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. పోలీస్‌, విద్యుత్‌, పెన్షన్‌ తదితర సమస్యలకు సంబంధించి ఒక్కో దరఖాస్తు అందినట్లు పేర్కొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.