← Back to news

కొండగట్టు గుట్టపై సెల్ టవర్..!

By Srikanth· 13h ago· Jagitial, Jagitial, Jagitial
కొండగట్టు గుట్టపై సెల్ టవర్..!

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తులకు సెల్ సిగ్నల్ సమస్య ఉంది. భక్తులు, అధికారులు పలుమార్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇండస్ సెల్ టవర్ సంస్థతో మాట్లాడి టవర్ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. ఇప్పటికే టవర్ ఏర్పాటు పూర్తయ్యింది. రేపు ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. దీంతో కొండపై భక్తులకు మొబైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.