టెట్ మినహాయింపు కోరి.. గుంటూరులో టీచర్ల ధర్నా!

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని విద్యాభవన్ ఎదుట ఇన్సర్వీస్ టీచర్లు నిరసనకు దిగారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాస్ మార్కులను 40 శాతానికి తగ్గించాలని, ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించాలని కోరారు. అంతేకాదు.. మ్యాథ్స్, సైన్స్ టీచర్లకు సంబంధిత సబ్జెక్టుల్లోనే టెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ స్పందించకపోతే విజయవాడలో భారీ ధర్నా చేస్తామని ఏపీటీఎఫ్ నాయకులు హెచ్చరించారు.



