← Back to news

టెట్ మినహాయింపు కోరి.. గుంటూరులో టీచర్ల ధర్నా!

By rajaratnam· 2d ago
టెట్ మినహాయింపు కోరి.. గుంటూరులో టీచర్ల ధర్నా!

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని విద్యాభవన్ ఎదుట ఇన్‌సర్వీస్ టీచర్లు నిరసనకు దిగారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాస్ మార్కులను 40 శాతానికి తగ్గించాలని, ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలని కోరారు. అంతేకాదు.. మ్యాథ్స్, సైన్స్ టీచర్లకు సంబంధిత సబ్జెక్టుల్లోనే టెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ స్పందించకపోతే విజయవాడలో భారీ ధర్నా చేస్తామని ఏపీటీఎఫ్ నాయకులు హెచ్చరించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.