తాగు నీటి కుళాయిలో మురుగునీరు వస్తోంది...

Dr.BR అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు పట్టణంలో కుళాయిల్లో దుర్వాసనతో కూడిన మురుగునీరు వస్తోంది. సుందరమ్మ చేరువుగట్టు ప్రాంతంలో 2 days కి ఒకసారి, 1/2 గంట మాత్రమే నీరు వస్తోంది. అయితే అవి తాగేందుకు పనికిరావు నీటి పైపులైన్లకు, మురుగు కాలువలకు మధ్య లీకేజీలు ఉండటమే కారణం. రిపేర్లు సరిగా చేయకపోవడంతో మురుగు నీరు తాగునీటి లైన్లలోకి కలుస్తోంది. ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ జిల్లాలో 30 గ్రామాలకూ తాగునీటి కష్టాలున్నాయి. జిల్లాలో 676 RO ప్లాంట్లు ఉంటే, 302 పనిచేయడం లేదు.



