పిల్లల పెంపకంపై ప్రియాంక టిబ్రెవాల్ కామెంట్లు

కోల్కతాలో నీట్ పరీక్షల రద్దు కోసం జరిగిన ఆందోళనలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నగరంలో భారీ త్రివర్ణ యాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేత ప్రియాంక టిబ్రెవాల్ మాట్లాడుతూ కొందరు కావాలనే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. "తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే వాళ్ళు మాట్లాడే భాషను బట్టే ఆ పెంపకం ఎలాంటిదో ఇట్టే తెలిసిపోతుంది" అని ఆమె అన్నారు.



