← Back to news

మంగంపేట బైరైటీస్ కొల్లగొడుతున్నారని నిజనిర్ధారణ కమిటీ ఆందోళన

By hymavathi· 1d ago· Tirupati (Nma) (Ct), Tirupati (Urban), Tirupati

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని మంగంపేట బైరైటీస్ గనుల మూసివేతపై నిజనిర్ధారణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అరుదైన ఖనిజ సంపదను భారీగా విదేశాలకు తరలిస్తూ జాతీయ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని కమిటీ అభిప్రాయపడింది. గనుల పరిస్థితి, టెండర్లు, ఎగుమతులు, మైన్ క్లోజర్ ప్రతిపాదనలపై అధ్యయనం కోసం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ మంత్రి, విశ్రాంత ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో కూడిన ఈ కమిటీ ఏర్పాటైందని పోరాట కమిటీ కన్వీనర్ కందారపు మురళి తెలిపారు.

మంగంపేట బైరైటీస్ కొల్లగొడుతున్నారని నిజనిర్ధారణ కమిటీ ఆందోళన

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 5h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.