అజయ్ కుమార్కు కీలక బాధ్యతలు

AP: విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన పి. అజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రిఫరీ బోర్డు చీఫ్ రిఫరీగా నియమితులయ్యారు. బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ నిర్దేశకుడిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ను చీఫ్ రిఫరీగా నియమిస్తూ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. 1990లో రాష్ట్రస్థాయి, 1993లో జాతీయస్థాయి రిఫరీగా ఎంపికైన ఆయన 33 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు 55 జాతీయస్థాయి పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.





