కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఏడు మంది మృతి
నార్త్ కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. సాంబురు కౌంటీలోని Mount Ololokwe వద్ద హెలికాప్టర్ క్రాష్ అవ్వడంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు అమెరికన్లు, ఈక్వెడార్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెడ్ మిచెల్ సెన్సి-కాంటూగి, ఆయన భార్య స్టెఫనీ ఉన్నారు. మారుమూల ప్రాంతం కావడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రమాదానికి కారణాలపై కెన్యా ఏవియేషన్ అధికారులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.



