ఇంకా చాలా మంది ఉన్నారా? టన్నెల్లో ఘోరం!
నేపాల్లో ఆగస్టు 26న వచ్చిన భారీ వరదల వల్ల 'త్రిశూలి 3A' హైడ్రో పవర్ ప్రాజెక్ట్ టన్నెల్లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులను రెస్క్యూ టీమ్స్ సేఫ్గా కాపాడారు. దాదాపు 10 రోజుల పాటు టన్నెల్ లోపలే ఉండిపోయిన వారిని ఎంతో కష్టపడి బయటకు తీశారు. సెర్చ్ ఆపరేషన్ టైమ్లో లోపల నుంచి మరికొందరి గొంతులు కూడా వినిపించడంతో రెస్క్యూ ఆపరేషన్స్ను మరింత స్పీడప్ చేశారు. ప్రస్తుతం ఆర్మీ, ఇతర సెక్యూరిటీ టీమ్స్ లోపల ఉన్న మిగతా వారిని బయటకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.



