← Back to news

UPI ట్రాన్సాక్షన్స్‌పై కేంద్రం కొత్త రూల్స్

By Krishna· 4h ago
UPI ట్రాన్సాక్షన్స్‌పై కేంద్రం కొత్త రూల్స్

సెంట్రల్ గవర్నమెంట్ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. ఇకపై 2,000 రూపాయల వరకు జరిగే UPI ట్రాన్సాక్షన్స్‌పై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు వెయ్యకూడదని తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, RuPay డెబిట్ కార్డుల ద్వారా 2,000 రూపాయల వరకు చేసే చెల్లింపులపై కూడా ఛార్జీల బ్యాన్ ఉంది. ఏ బ్యాంకు లేదా సిస్టమ్ ప్రొవైడర్ అయినా.. ఈ మోడ్‌ల ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసే పర్సన్‌పై డైరెక్టుగా లేదా ఇన్‌డైరెక్టుగా ఛార్జీ విధించకూడదు. ఈ నిర్ణయం ద్వారా డిజిటల్ పే మరింతగా యూజ్ అవుతుందని కేంద్రం భావిస్తోంది.

More in Current Affairs