ప్రధానిపై కామెంట్స్.. బాలిక క్షమాపణలు

జంతర్ మంతర్ వద్ద CJP నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడాకు చెందిన రుచికా సింగ్ క్షమాపణలు కోరారు. 'తనకు 15 ఏళ్లు మాత్రమేనని, తోటి నిరసనకారుల ప్రభావంతోనే అలా మాట్లాడానని' వీడియోలో తెలిపారు. 'తాను చేసిన వ్యాఖ్యలు క్షమించరాని తప్పని అంగీకరిస్తూ, దేశ ప్రజలను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని' ఆమె అన్నారు. ఈ ఘటనపై నమోదైన 'ZERO FIR'ను దిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నారు.


