← Back to news

గిరిజనుల కోసం CPM మహాధర్నా

By rajaratnam· 22 Aug 2026· జంగారెడ్డిగూడెం
గిరిజనుల కోసం CPM మహాధర్నా

AP : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో CPM నేతలు RDO ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. గిరిజనుల హక్కులు, భూముల విషయంలో అధికారులు, పోలీసులు భూస్వాములకే సపోర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గిరిజనుల కోసం పోరాడుతున్న తమ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీషీట్లను వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టాన్ని అమలు చేయాలని, ఎల్‌టీఆర్‌ భూముల విషయంలో పోలీసుల జోక్యం ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో CPM ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

More in Local