STPCలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

TG: మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ల పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో జీఎం నరసింహారావుకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్. విక్రమ్ కుమార్, ఉపాధ్యక్షులు తాటిపర్తి సాయికృష్ణ మాట్లాడుతూ పవర్ మెక్ కంపెనీ కార్మికులకు రావాల్సిన ఇంక్రిమెంట్లను చెల్లించాలని కోరారు.



