అల్లాపూర్లో డ్రైనేజీ సమస్య.. వెంటనే పరిష్కరించాలి

TG: నాగర్కర్నూల్ జిల్లా తాడూర్ మండలం అల్లాపూర్ గ్రామంలో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని DYFI జిల్లా కమిటీ సభ్యుడు అంతటి మహేశ్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎస్సీ, దళిత వాడల్లో మురుగునీరు రోజుల తరబడి నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ఇప్పటికే పలుమార్లు సర్పంచ్, గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందన్నారు.



