GO 97 రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన

TG : మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు GO 97ను రద్దు చేయాలంటూ రోడ్డుపై కూర్చొని నిరసన తెలియజేశారు. ఈ పోరాటానికి PDSU, AISB విద్యార్థి సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ జీవో వల్ల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయ్యాక పైచదువులైన ఇంజనీరింగ్ చదివే అవకాశాలు దెబ్బతింటాయని, అందుకే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు కోరారు.


