← Back to news

విద్యారంగ పరిరక్షణకు జంగయ్య కృషి అభినందనీయం

By Bhasker Mamilla· 4h ago
విద్యారంగ పరిరక్షణకు జంగయ్య కృషి అభినందనీయం

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో యూటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు కే.జంగయ్య ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన సభ నిర్వహించారు. ఆయన సుదీర్ఘ సేవలను సీపీఎం నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కొనియాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ సాగర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యారంగ పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల సాధనకు జంగయ్య చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఉద్యమాల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.