బొత్సపై కేఏ పాల్ సంచలన కామెంట్స్
AP: మాజీ మంత్రి బొత్సపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. “బొత్స ఒక నత్తోడు. ఆయన ఎలా మంత్రి అయ్యారో కూడా నాకు తెలియదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రపంచంలో యుద్ధాలను ఆపేందుకు తిరుగుతున్నానని, అలాంటి తన గురించి బొత్స మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. “లక్షల మంది ఎదుట బొత్స నా కాళ్లు పట్టుకుని నన్ను గెలిపించమని అడగలేదా?” అంటూ ప్రశ్నించారు.


