← Back to news

విద్యార్థిని మృతిపై మాజీ ఎమ్మెల్యే యాదవ్ విచారం

By Adithya· 1d ago
విద్యార్థిని మృతిపై మాజీ ఎమ్మెల్యే యాదవ్ విచారం

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి చెందడం తీవ్ర విషాదం కలిగించిందని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం ఆయన కళాశాలకు వెళ్లి, బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని అధ్యాపకులకు సూచించారు. ఇలాంటి సంఘటనలు విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టిస్తాయని, వారికి అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత వి. నారాయణరెడ్డి పాల్గొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.