విద్యార్థిని మృతిపై మాజీ ఎమ్మెల్యే యాదవ్ విచారం

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి చెందడం తీవ్ర విషాదం కలిగించిందని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం ఆయన కళాశాలకు వెళ్లి, బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని అధ్యాపకులకు సూచించారు. ఇలాంటి సంఘటనలు విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టిస్తాయని, వారికి అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత వి. నారాయణరెడ్డి పాల్గొన్నారు.



