పోచమ్మ ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమం

ఫరూక్నగర్ మండలం వెలిజర్లలో పోచమ్మ ఆలయ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై పూజలు చేశారు. గ్రామీణ ఆలయాల ప్రగతి కోసం కృషి చేస్తానని, యువతలో ఆధ్యాత్మిక చింతన పెరగాలని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ బాబు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులకు అన్నదానం చేశారు.



