← Back to news

పోచమ్మ ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమం

By Adithya D· 5d ago
పోచమ్మ ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమం

ఫరూక్‌నగర్ మండలం వెలిజర్లలో పోచమ్మ ఆలయ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై పూజలు చేశారు. గ్రామీణ ఆలయాల ప్రగతి కోసం కృషి చేస్తానని, యువతలో ఆధ్యాత్మిక చింతన పెరగాలని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ బాబు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులకు అన్నదానం చేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 59m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.