కొందుర్గ్ లో స్మార్ట్ కార్డులు పంచిన ఎమ్మెల్యే శంకర్

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల రైతు వేదికలో ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేదలకు పెద్దన్నగా నిలిచి నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేస్తోందని, అర్హులకు తక్షణమే కార్డులు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. MRO మీర్ అజమ్ అలీ, MPDO శ్రీరామ, MC చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, PAC చైర్మన్ తుమ్మలపల్లి పాల్గొన్నారు.




