నీట్ ధర్నాలో మంత్రి కూతురు

నీట్ పరీక్షపై జరిగిన ప్రొటెస్ట్ లో మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని స్టూడెంట్స్ ఆందోళన చేశారు. ఈ ధర్నాలో అస్సాం రెవెన్యూ శాఖ మంత్రి కేశబ్ మహంత కూతురు 'దిబిసా' కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేశబ్ మహంత పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ. ఎదిగిన పిల్లల పనులకు తల్లిదండ్రులను తప్పుపట్టడం కరెక్ట్ కాదని చెప్పారు. నేటి తరానికి సొంత ఆలోచనలు ఉంటాయని, ఆమెను కలిసినప్పుడు దీని గురించి మాట్లాడుతానని సీఎం తెలిపారు.



