AIKMS చిత్తూరు జిల్లా కొత్త కమిటీ ఎంపిక

AP : పలమనేరులో AIKMS ఏపీ రైతు కూలీ సంఘం చిత్తూరు జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఉమాపతి నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా తేజ కల్లూరు, ప్రధాన కార్యదర్శిగా వెంకటరమణారెడ్డిలతో పాటు ఇతర నాయకులు ఎంపికయ్యారు. వానలు లేక టమాటా, మామిడి పంటలు నష్టపోయిన రైతుల తరఫున పోరాడాలని నాయకులు అన్నారు. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.

