ఆదర్శ వివాహం: 0% ఖర్చు.. 100% సేవ!

ఒడిశాకు చెందిన శుభశ్రీ, కర్ణాటకకు చెందిన ప్రదీప్ అనే శాస్త్రవేత్తల జంట తమ పెళ్లిని విభిన్నంగా చేసుకున్నారు. ఖరీదైన హంగూలు లేకుండా రక్తదానం, అనాథలకు వస్త్రదానం మరియు మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలతో మూడు రోజుల పాటు ఈ వెడ్డింగ్ నిర్వహించారు. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ, ప్లాస్టిక్ మరియు మాంసాహారాన్ని పూర్తిగా దూరం పెట్టి సమాజానికి ఒక కొత్త మెసేజ్ ఇచ్చారు.

