APకి భారీ డిజిటల్ బూస్ట్.. విశాఖకు కొత్త కనెక్టివిటీ!

AP: రాష్ట్రానికి మరో భారీ డిజిటల్ ప్రాజెక్ట్ దక్కింది. ముంబై, చెన్నై తర్వాత దేశంలో మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్గా ఏపీ ఎదగనుంది. విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, AI ఫెసిలిటీ రానున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా టెక్ దిగ్గజాలు సముద్రం కింద ఇంటర్నెట్ కేబుల్స్ ఏర్పాటు చేయనున్నాయి. ఆల్మోస్ట్ 3,600 కి.మీ I-2SEA కేబుల్తో విశాఖకు సింగపూర్, సౌత్ఈస్ట్ ఏషియాతో నేరుగా కనెక్టివిటీ వస్తుంది. 2029 చివరి నాటికి నెట్వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.



