కనీస వేతనాలు అమలు చేయాలి

TG: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను వెంటనే అమలు చేయాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్(TUCI) డిమాండ్ చేసింది. రాష్ట్ర నాయకులు అలివేల ఆచారి మాట్లాడుతూ తెలంగాణలో కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది వర్కర్లకు అత్యల్ప వేతనాలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కేజీబీవీల్లో మెరుగైన వేతనాలు అందుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం వేతనాలు పెంచకపోవడం దారుణమని తెలిపారు.



