← Back to news

కనీస వేతనాలు అమలు చేయాలి

By Bhasker Mamilla· 4d ago
కనీస వేతనాలు అమలు చేయాలి

TG: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ వర్కర్లకు ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను వెంటనే అమలు చేయాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌(TUCI) డిమాండ్‌ చేసింది. రాష్ట్ర నాయకులు అలివేల ఆచారి మాట్లాడుతూ తెలంగాణలో కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది వర్కర్లకు అత్యల్ప వేతనాలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కేజీబీవీల్లో మెరుగైన వేతనాలు అందుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం వేతనాలు పెంచకపోవడం దారుణమని తెలిపారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.