← Back to news

రాహుల్ గాంధీపై కేసు.. సిగ్గుచేటు!

By Sravan· 3d ago
రాహుల్ గాంధీపై కేసు.. సిగ్గుచేటు!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్, గాంధీపై అక్రమంగా ఎఫ్ఐఆర్ పెట్టడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన జరిగింది. ఎంపీ బలరాం, నాయక్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాహుల్ గాంధీపై ఇలా కేసు పెట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మురళి, నాయక్ ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడతామన్నారు. బీజేపీ కుట్రలను ఎండగడతామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భూక్య, ఉమా నాయక్ హెచ్చరించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.