← Back to news

Nov 17న సామూహిక సెలవుకు సిద్ధం! పాత పెన్షన్ ఇవ్వండి

By ARJUN· 3d ago
Nov 17న సామూహిక సెలవుకు సిద్ధం! పాత పెన్షన్ ఇవ్వండి

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలంటూ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. సెప్టెంబర్ 1న జిల్లావ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన మానిఫెస్టో లో ప్రకటించిన దానినే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, అందుకే నవంబరు 17న సామూహిక లీవ్ పెట్టాలని యూనియన్ నాయకులు పిలునిచ్చారు. ఆ రోజున ఉద్యోగులంతా ఏకమై ఆందోళనను విజయవంతం చేయాలని కోరారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· just now

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.