Nov 17న సామూహిక సెలవుకు సిద్ధం! పాత పెన్షన్ ఇవ్వండి

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలంటూ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. సెప్టెంబర్ 1న జిల్లావ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన మానిఫెస్టో లో ప్రకటించిన దానినే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, అందుకే నవంబరు 17న సామూహిక లీవ్ పెట్టాలని యూనియన్ నాయకులు పిలునిచ్చారు. ఆ రోజున ఉద్యోగులంతా ఏకమై ఆందోళనను విజయవంతం చేయాలని కోరారు.



