🚰 15 ఏళ్లుగా మంచినీళ్లు లేవు

AP : ఏలూరు జిల్లా కట్టుమోతులగూడెంలో తాగునీరు లేక 15 ఏళ్లుగా జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కొళాయిల నుంచి బురద, కలుషిత నీరు రావడంతో పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు, మహిళలు నిరాహార దీక్ష చేశారు. 300 నుండి 400 ఫ్యామిలీస్ ఉండే ఈ ఊళ్లో కనీసం డ్రైనేజీ కూడా లేదని మండిపడ్డారు. అధికారులు వెంటనే కొత్త బోర్ వేసి మంచినీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.



