గోసంగి సంఘం నూతన జిల్లా కార్యవర్గం ఏర్పాటు

TG: గోసంగి సంఘం నూతన జిల్లా కార్యవర్గం కొలువుదీరింది.. అధ్యక్షుడిగా ఈర్నాల వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లాలో గోసంగి సంఘం ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఈర్నాల వినోద్ కుమార్ మాట్లాడుతూ.. డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలకు కట్టుబడి గోసంగి జాతి విద్యా, ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.



