నూకపల్లి కాలనీకి 30కోట్లు.. ధర్నా ఫలితం

జగిత్యాల జిల్లాలోని నూకపల్లి అర్బన్ డబుల్ బెడ్రూం కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న 15 ప్రధాన సమస్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించనందున బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డా. విశారదన్ మహరాజ్ స్థానికులతో కలిసి మహాధర్నా నిర్వహించారు. దీంతో హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. కాలనీ మౌలిక సదుపాయాల కోసం సుమారు 30 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ఇది జేఏసీ పోరాట ఫలితమేనని సంఘం నాయకులు తెలిపారు.



