అభివృద్ధి ఎప్పుడు?.. నూతన కమిటీపై ప్రజల అసంతృప్తి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ లక్మాపూర్లోని పురాతన శ్రీ రాములగుట్ట ఆలయ అభివృద్ధి ఆగిపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నా, అభివృద్ధి పనులు, మౌలిక వసతులు మాత్రం పెండింగ్లోనే ఉన్నాయంటున్నారు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడే లీడర్లకు గుడి గుర్తుకొస్తుందని ప్రజలు విమర్శిస్తున్నారు. కొత్త కమిటీ వచ్చినా డెవలప్మెంట్ కోసం ఎలాంటి రివ్యూ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


