ప్రజావాణిలో ప్రజలున్నారు... అధికారులు?

భీమదేవరపల్లిలో ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సమయానికి రాకపోవడంతో న్యాయవాది తాళ్లపల్లి మధుకర్ ఫిర్యాదు చేశారు. ఈనెల 17న ఎంపీడీవో ఆఫీసులో జరిగిన ప్రజావాణిలో – అధికారులిచ్చిన టైమ్కు వాళ్లే రాలేదట. "ప్రజా సమస్యల కోసం వచ్చిన వాళ్లందరూ ఎదురుచూడాల్సిందేనా?" అంటూ మధుకర్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు."అధికారులే లేట్ అయితే, ప్రజలు ఎవరికి చెప్పుకోవాలే" – ఇదీ ఆయన ప్రశ్న. ఇప్పుడు ఈ ఫిర్యాదు కలెక్టర్ దృష్టికి వెళ్లింది. సమయానికి రాని అధికారులపై చర్యలు తీసుకుని ఓ క్లియర్ మెసేజ్ ఇస్తారో లేదో చూడాలి.



