ప్లాస్టిక్ వేటలో NSS..! 150 మంది వాలంటీర్ల స్పందన

గుంటూరు జిల్లా ఆచార్య, నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్లాస్టిక్ నిర్మూలనకు భారీ స్పందన వచ్చింది. గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఇంజినీరింగ్ కాలేజ్ NSS యూనిట్ ఈ కార్యక్రమం చేపట్టింది. సుమారు 150 మంది వాలంటీర్లు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.<br>ప్రిన్సిపాల్ లింగరాజు, NSS కోఆర్డినేటర్ దివ్య తేజోమూర్తి మార్గదర్శకత్వంలో ఈ డ్రైవ్ జరిగింది.




