ఆదివాసీల రక్షణ కవచంపై దెబ్బ

AP : ఆంధ్రప్రదేశ్లోని 5వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులకు 1/70 భూ బదిలీ నిరోధక చట్టమే కొండంత అండ. కానీ, ఈ చట్టాన్ని సవరించాలని కోరుతూ 2023లో 1,672 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ పక్షాన గట్టిగా నిలబడి, హక్కుల రక్షణ కవచమైన 1/70 చట్టాన్ని కాపాడాలని ఆదివాసీ సమాజం ఆశగా ఎదురుచూస్తోంది.



