బ్రిడ్జి నిర్మాణం నత్తనడక.. గ్రామాలకు రాకపోకలు బంద్

AP: బ్రిడ్జి నిర్మాణం పూర్తికాక.. గిరిజన గ్రామాలకు రాకపోకలు కష్టంగా మారాయి. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని కోరుకొండ నుంచి వీరవరం బురుగుబైలు వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చాలాకాలంగా కొనసాగుతున్నా పూర్తికాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు, గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పలు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు.





