పేదలకు భూములు ఇవ్వాలి.. ప్రజాసంఘాల డిమాండ్
AP: పల్నాడు జిల్లాలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమ పాస్పుస్తకాలు, రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు. వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే భూముల్లో ఉన్న ఎర్రచందనం, ఇతర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.



