CM రేవంత్ రెడ్డికి MP రఘునందన్ సవాల్

TG: 'జెన్ జీ' ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25ఏళ్ల నుంచి 21కి తగ్గించాలని, రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ MP రఘునందన్రావు తీవ్ర విమర్శలు చేశారు. జెన్జీకి నిజంగా ప్రాధాన్యం ఇస్తే ముందుగా కాంగ్రెస్లోనే ఓ యువ ఎమ్మెల్యేకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించాలని సవాల్ విసిరారు. GHMCకి యువ మేయర్ను చేయాలని సూచించారు.



